దీపావళి పండుగ వేళ కుమురంభీం జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. అక్క, తమ్ముడు, మూడేళ్ల చిన్నారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాగజ్నగర్ నుంచి బెండార గ్రామానికి వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.