ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలను అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. యువత ఈజీ మనీ కోసం ఆకర్షితులవుతున్నారు. బెట్టింగ్కు బానిసలవుతున్నారు. మరోవైపు, బెట్టింగ్ యాప్లు కూడా అనేక రకాలుగా యువతను మోసం చేస్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ యాప్లు ఎలా మోసం చేస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.