తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన పలు విషయాలపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెట్టింగ్ యాప్లను గత ప్రభుత్వమే నిషేధించిందని.. కానీ సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల పలు సంఘనటలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. బెట్టింగ్ యాప్లను నిరోధించేందుకు.. రాష్ట్రంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.