కేరళ ప్రజలు ఓ తెలుగు వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎలా ఉన్నారంటూ ఆరా తీస్తున్నారు. గతంలో పేదలకు ఆయన చేసిన సహాయాన్ని ఇప్పటికీ వారు మర్చిపోలేకపోతున్నారు. ఆయనెవరో కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వి.ఆర్. కృష్ణతేజ. అలప్పుజలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒక అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పించడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అధికారిగా ఉండటంతో, ఆయన సేవలను కేరళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.