Chandrababu Naidu On Kunamneni Comments: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండవ రోజు అమరావతి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 30 ఏళ్ల క్రితం తర్వాత తన ఆలోచనల్ని ఆయన అర్థం చేసుకున్నారని వ్యాఖ్యనించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారన్నారు.. కానీ ఇప్పుడైనా అర్థం చేసుకున్నారన్నారు చంద్రబాబు.