ఆయిల్ పామ్ రైతుల పంట పండింది. ఆయిల్ పామ్ గెలల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. టన్ను గెలల ధర రూ.24,025కు పెరగగా.. దేశ ఆయిల్ పామ్ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా అధికారులు పేర్కొన్నారు. జూలైలో రూ.23,783గా ఉన్న ధర ఆగస్టు చివరి నాటికి రూ.242 పెరిగింది. పెరిగిన ధరను ఆగస్టు నెలకు అమలు చేయనున్నట్లు టీజీ ఆయిల్ఫెడ్ తెలిపింది. మరోవైపు ఆగస్టులోనే గతంలో ఎన్నడూ లేనంతగా రూ.175 కోట్లను రైతులకు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.