బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం అనంతరం సేకరించిన శరీర అవశేషాలను.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 27వ తేదీన తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించాలని.. దీనికి కావాల్సిన భద్రత, వసతులను ప్రభుత్వం సమకూర్చాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు సూచించింది.