కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆరు సంవత్సరాల తర్వాత రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. మరోవైపు, బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ కేటీఆర్, హరీశ్రావు వంటి బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్ భవన్కు చేరుకుని నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.