వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతులకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దంతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందితో సహా దాదాపు 3 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కానీ, విలీనం చేశాక ప్రమోషన్లను మాత్రం ఇవ్వలేదని యూనియన్ నాయకులు అన్నారు.