ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపికబురు వినిపించారు. దీపావళికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామన్న చంద్రబాబు.. నవంబర్ నుంచి జమచేస్తామన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.