ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఆరు నెలలకు ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈ వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఆస్పత్రులు, డిస్పెన్షరీల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు.