Balabhadrapuram Temple Biryani Packets: ఆంధ్రప్రదేశ్లోని బలభద్రపురం సాయిబాబా ఆలయం భక్తులకు వినూత్నంగా రెడీ-టు-కుక్ బిర్యానీ ప్యాకెట్లను ప్రసాదంగా అందిస్తోంది. ఈ బిర్యానీ ప్యాకెట్ల అమ్మకాల ద్వారా ఆలయానికి కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, ఉచిత వైద్య శిబిరాలకు వినియోగిస్తున్నారు. గతంలో అరకిలో రూ.30కు అమ్మేవారు, ఇప్పుడు రూ.75కు పెంచారు. మొత్తం మీద బలభద్రపురంలోని సాయిబాబా ఆలయం బిర్యానీ ప్యాకెట్ల ప్రసాదంతో ఫేమస్ అయ్యింది.