వనపర్తి జిల్లాలో 9వ తరగతి అబ్బాయి, ఇంటర్ బాలిక ప్రేమ పేరుతో పెట్టుకున్న సంబంధం కారణంగా బాలిక గర్భం దాల్చి, శిశువుకు జన్మనిచ్చింది. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసినా.. చర్యలకు వెనుకంజ వేశారు. గ్రామంలో పంచాయితీ పెట్టినా.. బాలుడి తల్లిదండ్రులు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో న్యాయం కోసం బాలిక కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి.. శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్లు, పర్యవేక్షణ లోపం వంటి సామాజిక కారణాలపై ఈ ఘటన విశ్లేషణను కోరుతోంది.