Inter Maths Exam Marks Pattern Changed: ఇంటర్ విద్యార్థులకు అందునా గణితం సబ్జెక్ట్ ఉన్న వారికి తెలంగాణ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మ్యాథ్స్ పరీక్ష 75 మార్కులకు బదులు 60 మార్కులకే.. అది కూడా థియరీ ఉంటుంది. మిగిలిన 15 మార్కులు ఇంటర్నల్స్గా వస్తాయి. MPC, MEC విద్యార్థులకు వేర్వేరు పేపర్లు, సిలబస్ రానుంది. కఠినమైన చాప్టర్లను మార్చి, విద్యార్థుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్పులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి.