తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ నిబంధనను రద్దు చేశారు. ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి. హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.