నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం హెచ్సీఎల్ టెక్ బీ (HCL TechBee) ఆధ్వర్యంలో డిసెంబర్ 14 (ఆదివారం) నాడు ఉద్యోగ మేళా (Job Mela) నిర్వహిస్తున్నారు. ఇంటర్లో 75 శాతం ఓవరాల్ మార్కులు.. మ్యాథమాటిక్స్లో 60 శాతం మార్కులు తప్పనిసరిగా పేర్కొన్నారు. వర్ని రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఉదయం 10 గంటలకు ఈ డ్రైవ్ జరుగుతుంది. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.