తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు, మధ్యతరగతి వర్గాల కోసం హౌసింగ్ బోర్డు ద్వారా సరికొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టును చేపడుతోంది. వరంగల్ జిల్లా కుడా (KUDA) పరిధిలోని 10 ఎకరాల్లో మొదటి దశలో 700 ఫ్లాట్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో అల్పాదాయ (LIG), మధ్య ఆదాయ (MIG), ఉన్నతాదాయ (HIG) వర్గాల కోసం వేర్వేరు విస్తీర్ణాల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఎల్ఐజీ ఫ్లాట్ ధర సుమారు రూ. 19.20 లక్షలు కాగా, హెచ్ఐజీ ధర రూ. 57.45 లక్షలుగా ప్రాథమికంగా నిర్ణయించారు.