అత్యాచారానికి యత్నిస్తే ప్రతిఘటించిందనే కోపంతో మహిళ ప్రైవేట్ పార్ట్ కొరికి పారిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరవకొండలో ఈ ఘటన జరగ్గా.. బాధితురాలకి తీవ్ర రక్తస్రావం కావటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఘటన తర్వాత పరారవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తు్న్నారు. మరోవైపు బాధితురాలు ఒంటరి మహిళ.. గతంలో నిందితుడి వద్ద మగ్గం పని చేసేదని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల మానేసినట్లు వివరించారు.