తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది. ఈ పథకం అమలుకు నేడు రూ. 13 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ నిధులను 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. బేస్మెంట్ స్థాయిలో ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు అందుతుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.