ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎవరైనా అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు తేలితే అవి ఏ దశలోఉన్నా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పథకంలో పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.