తన గూడెం బిడ్డల కోసం ఎకరం భూమిని దానం చేసిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం లేతుబాయి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ఔదార్యం ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల వివాదాస్పదంగా మారింది. అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని నిర్మాణాలు అడ్డుకోవడంతో.. దాతగా సన్మానాలు అందుకున్న మహిళ ఇప్పుడు తన భర్తతో కలిసి కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది.