తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో వేగం పెంచాలని నిర్ణయించింది. మూడు నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన ఇళ్లను జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.