ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇసుక కొరత తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదు. వ్యాపారులు అధిక ధరలకు ఇసుక అమ్ముతూ లబ్ధిదారులపై అదనపు భారం మోపుతున్నారు. అధికారులు ప్రకటించిన ఇసుక రీచ్లు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.