తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ బిల్లులను ఇకపై ప్రతి వారం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.