ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్.. బిల్లులో రూ.60 వేలు కోత..!

7 months ago 20
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపుల విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు బేస్‌మెంట్‌ వరకు రూ.1 లక్ష, రూఫ్‌ లెవల్‌ వరకు మరో లక్ష, శ్లాబ్‌ వేసిన తర్వాత రూ.2 లక్షలు, చివరగా రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు చెల్లించేవారు. ఇకపై శ్లాబ్‌ వేసిన తర్వాత ఖాతాలో రూ.1.40 లక్షలు మాత్రమే జమ అవుతాయని మంత్రి తెలిపారు. మిగిలిన రూ.60 వేలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తారని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read Entire Article