ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు కట్టుకునే పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లబ్ధిదారులకు.. రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, మహిళా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకే లక్ష రూపాయలకు పైగా రుణాలు ఇప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అలానే తక్కువ ధరకు ఇసుక వంటి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు మరో శుభవార్తతో ముందుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.12 వేల ప్రోత్సాహకాన్ని అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ వివరాలు..