పేదల సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక పరిణామం. రూ.5 లక్షల సాయం అందిస్తున్నా, కొందరు నిర్మాణాలు మొదలుపెట్టకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. గడువు దాటిన వారి ఇళ్ల మంజూరు రద్దు చేసి, కొత్తవారికి కేటాయించే ఆలోచనలో అధికారులున్నారు. కాగా, నిర్మాణానికి డబ్బులు సరిపోవడం లేదని, స్థలం సమస్యలున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు.