ponguleti warning officials about indiramma illu: తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులకు ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఇళ్లలో గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 1.95 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.