ఇకపై ఏపీ ప్రజలు కంటి సమస్యలకు హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఎల్వీ ప్రసాద్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో 'కాసరనేని పరిపూర్ణ లక్ష్మీ నేత్ర వైద్యశాల' అందుబాటులోకి రానుంది. విశ్రాంత ఐఏఎస్ దంపతులు భూమిని విరాళంగా ఇవ్వడంతో ప్రారంభమైన ఈ కేంద్రం, అత్యాధునిక సేవలతో పాటు టెలీ ఆప్తమాలజీ సేవలను కూడా అందిస్తుంది.సోమవారం నుంచి శనివారం వరకు సేలు అందిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు..