అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు మూడేళ్లలో 120 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ తరగతుల ద్వారా కార్యకర్తలకు తర్ఫీదు అందిస్తున్నారు. ఏడాదిలో ఆరు రోజుల చొప్పున మూడేళ్లలో 18 రోజులు ప్రత్యక్ష తరగతులను మిగిలిన రోజుల్లో ఆఫ్ లైన్ విధానంలోనూ అందించే సర్టిఫికేషన్ కోర్సు రూపొందించారు.