రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో నూతన సర్పంచ్ చింతపల్లి విజయమ్మ తన నిజాయితీని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో "నన్ను గెలిపిస్తే కోతుల సమస్యను తీరుస్తాను" అని ఆమె హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆమెను గెలిపించగా.. అన్నట్టుగానే గెలిచిన మరుసటి రోజే సొంత ఖర్చులతో రంగంలోకి దిగారు. కోతులను పట్టే నిపుణులను పిలిపించి.. గ్రామంలోని 100కు పైగా కోతులను బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చిన సర్పంచ్పై గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.