Two Software Engineers Suspicious Death In Annamayya District: సంక్రాంతికి సొంత ఊరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనుమానాస్పద రీతిలో మరణించారు. మద్యం సేవించిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కల్తీ మద్యం కాదని, అధికంగా బీర్లు తాగడం వల్లే డీహైడ్రేషన్ తో మరణించినట్లు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అదే బీర్లు తాగిన మిగతా యువకులు క్షేమంగానే ఉన్నారని ట్వీట్ చేశారు.