రైలు ప్రయాణీకుల్లో వృద్ధులు, గర్భిణీలు, 45 ఏళ్లు దాటిన మహిళల కోసం రైల్వేశాఖ ప్రత్యేక కోటాను అమలు చేస్తోంది. టికెట్ బుక్ చేసే సమయంలో లోయర్ బెర్తు కోసం అభ్యర్థిస్తే, వీరికి ప్రాధాన్యత ఇస్తారు. స్లీపర్ క్లాస్లో ఆరు నుంచి ఏడు, ఏసీ త్రీ-టైర్లో నాలుగు నుంచి ఐదు బెర్తులు కేటాయిస్తారు. సికింద్రాబాద్, కాచిగూడ వంటి స్టేషన్లలో వీల్చైర్లు, బ్యాటరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక.. 119 స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి వృద్ధులకు సులువుగా ప్రయాణించేందుకు సదుపాయాలు కల్పిస్తున్నారు.