ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ నవరాత్రోత్సవాల సీజన్ నడుస్తోంది. ఇదే అదనుగా కొందరు తమ చేతులకు పనిచెబుతున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసే విగ్రహాలను చూసేందుకు భక్తులు తరలివస్తుండగా.. వారి జేబులను గుల్ల చేస్తున్నారు. బైక్లు, కార్లు తీసుకుని.. గణేష్ మండపాల వద్దకు వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేంటీ అంటే.. దర్శనం టికెట్లు, పార్కింగ్ ఫీజు అంటూ జులం ప్రదర్శిస్తున్నారు. విశాఖలో ఇలాంటి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.