Rangareddy Rs 15 Lakh Robbery Case: రంగారెడ్డి జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత అక్కే తమ్ముడి ఇంట్లో చోరీకి పాల్పడింది. శివశంకర్ అనే వ్యక్తి ఇంట్లో రూ.15 లక్షలు దొంగతనానికి గురయ్యాయి. పోలీసులు కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. శివశంకర్ సోదరి స్వప్న కేసులో ప్రధాన నిందితురాలు. ఆమె.. అశోక్, రఘు అనే వ్యక్తులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భూమి అమ్మగా వచ్చిన డబ్బును కాజేయాలనే స్వప్న ఈ దారుణానికి ఒడిగట్టింది.