AP Plastic E Waste Collect From Doorstep: స్వచ్ఛాంధ్ర సంస్థ త్వరలో ఇంటింటికీ తిరిగి ప్లాస్టిక్, ఈ-వేస్ట్ సేకరించనుంది. ఇందుకోసం 50 వేల మంది చెత్త ఏరుకునే వారిని వినియోగించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దశలవారీగా నిషేధిస్తామని ఛైర్మన్ కె. పట్టాభిరామ్ తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డులను తొలగించి, విద్యుత్, ఎరువుల తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి రోడ్లపై చెత్త కనపడకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా ఈ-ఆటోలు, కాంపాక్టర్లను అందుబాటులోకి తేనున్నారు.