శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం దొరికింది. ఈసారి ఇస్త్రీ పెట్టెలో దాచి 1.55 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా DRI అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు CISF కూడా డ్రోన్ కెమెరాలు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్వర్క్పై అధికారులు ఆరా తీస్తున్నారు.