మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు లావణ్య, అనురాధ, నవీన్ల జీవితం దుర్భరంగా మారింది. తల్లి ఇల్లు విడిచి వెళ్ళగా.. తండ్రి గతేడాది చనిపోయాడు. దీంతో మేనత్త లక్ష్మి వారిని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించింది. అయితే స్వగ్రామంలో ఇల్లు కూడా లేకపోవటంతో బడికి సెలువులు వస్తే ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.