హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ఫిబ్రవరి చివరి వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.