మున్సిపల్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే గడువు పూర్తి చేసుకున్న 87 పురపాలక సంఘాలతో పాటుగా నవంబర్ నెలతో పదవీకాలం పూర్తి కానున్న మరో 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల కారణంగా 23 పురపాలక సంస్థలలో ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.