హైదరాబాద్లో ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్రాక్కు ఓఆర్ఆర్ మీదుగా కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్ సర్వీస్ ప్రారంభమైంది. బాచుపల్లి క్రాస్ రోడ్డు, మల్లంపేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్లు, సైయంట్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా బస్సులు వేవ్రాక్కు చేరుకుంటాయి. ఉదయం నాలుగు ట్రిప్పులు, సాయంత్రం మూడు రిటర్న్ సర్వీసులు నడుస్తాయి. ఐటీ కారిడార్కు వెళ్లే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులకు ఈ సర్వీస్ ఉపయోగపడనుంది. 100 శాతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులతో సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది.