రైతులకు గుడ్న్యూస్. ప్రభుత్వం 'సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్' పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు వ్యవసాయ యంత్రాలపై రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అక్టోబర్ 31లోగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించవచ్చు.