కొత్త ఏడాది వేడుకల్లో మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అదిరిపోయే వార్నింగ్ ఇచ్చారు. తాగి బండి నడిపితే చంచల్గూడ జైలుకు వెళ్లాల్సిందేనని, అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారని వ్యగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు, పరీక్షల్లో పాస్ అవ్వడం వేరు, డ్రంకెన్ డ్రైవ్లో మీటర్ దాటితే జీవితం ఆగమైపోతుందని ఆయన హెచ్చరించారు. నగరంలో రోడ్లపై రక్తపాతం జరగనివ్వబోమని, బాధ్యతతో ఇంటికి వెళ్లడమే యువతకు మంచిదని సూచించారు. రాత్రి 7 గంటల నుంచి తనిఖీలు మొదలయ్యాయి.