పార్టీ మార్పు వార్తలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. బీఆర్ఎస్ తనను అవమానించి బయటకు పంపిందని.. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్లో వెలసిన పోస్టర్లు కుట్రలో భాగమని, పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని గుర్తు చేశారు. గతంలో వైఎస్సార్ ఆఫర్ ఇచ్చినా ఉద్యమ బాటలోనే నడిచానని.. తన నిబద్ధతను శంకించవద్దని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని కార్యకర్తలు పుకార్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.