ఈనెల 27న ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు ఉన్న నేపథ్యంలో ఆ రోజు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కొన్ని విద్యా సంస్థలు సెలవు ఇవ్వట్లేదని.. గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు.