వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన ప్రశాంత్ రెడ్డి.. తన కూతురి పెళ్లి సంతోషాన్ని సొంతూరి ప్రజలతో పంచుకున్నాడు. సిద్ధపేట జిల్లా బద్దిపడగ గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశాడు. అనంతరం 1300 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశాడు. అయితే ఆచారంలో భాగంగా గ్రామ దేవతలను పూజించి.. తనకు తోచినంత ఊరి ప్రజలకు సహాయం చేశానని చెప్పాడు ప్రశాంత్ రెడ్డి.