ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులలో అధిక భాగం ఉత్తరాంధ్ర వైపు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. అనేక పరిశ్రమలు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని.. పరిశ్రమల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ అక్కడి నుంచి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.