Visakhapatnam South Coast Railway Zone From June 1st: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రజల కల నెరవేరబోతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి నోటిఫై చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే అధికారుల నియామకాలు పూర్తి చేయగా.. మరికొందర్ని నియమించనున్నారు. అంతేకాదు దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కొత్తగా మరో రెండు సెక్షన్లు కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు.