గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇంజిన్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. దీంతో భయపడి గోరఖ్పుర్లో రైలు ఎక్కినట్లు చెప్పారు. అనంతరం రైలులో కొందరు చంపేస్తాని బెదిరించడంతో.. ఇంజిన్పైకి ఎక్కినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.