పాతబస్తీలో ఓ విచిత్ర పెళ్లి ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఓ యువకుడికి యువతిని ఉదయం పరిచయం కాగా.. అదే రోజు మధ్యాహ్నం వివాహం చేసుకున్నాడు. సాయంత్రం ఆమెతో షాపింగ్, రాత్రి డిన్నర్ చేశాడు. ఆ తర్వాత శోభనం కోసం హోటల్కు వెళ్లారు. అయితే కొద్దిసేపటికే.. ఆ యువతి తనకు నడుము నొప్పి అని చెప్పి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత వధువు అక్కగా పరిచయం చేసుకున్న మహిళ.. ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేశామని చెప్పగా.. అక్కడికి వెళ్లిన యువకుడికి షాక్ తగిలింది. దీంతో ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.